స్కైరూట్​ కొత్త ఫెసిలిటీ చూసిన కేంద్ర మంత్రి

స్కైరూట్​ కొత్త ఫెసిలిటీ చూసిన కేంద్ర మంత్రి

హైదరాబాద్​, వెలుగు: స్టార్టప్​ కంపెనీ స్కైరూట్ ఏరోస్పేస్​ కొత్త ఫెసిలిటీని కేంద్ర సైన్స్​ అండ్​ టెక్నాలజీ మినిస్టర్​ డా. జితేంద్ర సింగ్​ సందర్శించారు. ప్రభుత్వం తీసుకున్న చొరవ వల్ల  నాలుగేళ్లలోనే స్పేస్​ సెక్టార్లో అనేక స్టార్టప్​  కంపెనీలు ఏర్పాటయ్యాయని మంత్రి చెప్పారు. ఒక అంకెకే పరిమితమైన స్పేస్​  స్టార్టప్​లు నేడు 150 దాటాయని పేర్కొన్నారు. 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కొత్త ఫెసిలిటీని  స్కైరూట్​ ఏర్పాటు చేసింది.

 దేశంలో టాలెంట్​ కొదవ లేదనడానికి స్కైరూట్​ సక్సెస్​ నిదర్శనంగా నిలుస్తుందని జితేంద్ర సింగ్​ అన్నారు. స్పేస్​ సెక్టార్లో పబ్లిక్​ ప్రైవేట్​ పార్టనర్​షిప్​ (పీపీపీ) తేవడం వల్ల ఆ రంగం అనూహ్యంగా గ్రోత్​ సాధిస్తోందని వివరించారు. శ్రీహరికోట నుంచి మొట్టమొదటిసారిగా ప్రైవేట్​ రాకెట్​ను లాంఛ్​ చేసిన ఘనతను స్కైరూట్​ దక్కించుకుందని ఆయన కొనియాడారు. ఐఐటీలో చదువుకున్న పవన్, భరత్​లు ఈ స్కైరూట్​ కంపెనీని నెలకొల్పారు.