
హైదరాబాద్, వెలుగు: స్టార్టప్ కంపెనీ స్కైరూట్ ఏరోస్పేస్ కొత్త ఫెసిలిటీని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ డా. జితేంద్ర సింగ్ సందర్శించారు. ప్రభుత్వం తీసుకున్న చొరవ వల్ల నాలుగేళ్లలోనే స్పేస్ సెక్టార్లో అనేక స్టార్టప్ కంపెనీలు ఏర్పాటయ్యాయని మంత్రి చెప్పారు. ఒక అంకెకే పరిమితమైన స్పేస్ స్టార్టప్లు నేడు 150 దాటాయని పేర్కొన్నారు. 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కొత్త ఫెసిలిటీని స్కైరూట్ ఏర్పాటు చేసింది.
దేశంలో టాలెంట్ కొదవ లేదనడానికి స్కైరూట్ సక్సెస్ నిదర్శనంగా నిలుస్తుందని జితేంద్ర సింగ్ అన్నారు. స్పేస్ సెక్టార్లో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) తేవడం వల్ల ఆ రంగం అనూహ్యంగా గ్రోత్ సాధిస్తోందని వివరించారు. శ్రీహరికోట నుంచి మొట్టమొదటిసారిగా ప్రైవేట్ రాకెట్ను లాంఛ్ చేసిన ఘనతను స్కైరూట్ దక్కించుకుందని ఆయన కొనియాడారు. ఐఐటీలో చదువుకున్న పవన్, భరత్లు ఈ స్కైరూట్ కంపెనీని నెలకొల్పారు.