
లక్నో : డాక్టర్లు.. నేషన్ ఫస్ట్ (దేశం ముందు) అనే స్ఫూర్తితో పనిచేయాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ సూచించారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్న ప్రధాని మోదీ కలలను నిజం చేసే దిశగా పనిచేయాలని కోరారు. శనివారం లక్నోలోని సంజయ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 28వ కాన్వొకేషన్లో మాండవీయ పాల్గొని మాట్లాడారు. ఆరోగ్యకరమైన సమాజం.. ఆరోగ్యకరమైన దేశాన్ని సృష్టించగలదని, ఆరోగ్యకరమైన దేశం మాత్రమే సంపన్న దేశాన్ని సృష్టిస్తుందని ఆయన చెప్పారు. డాక్టర్లు రోగికి ట్రీట్మెంట్ చేయడమే కాకుండా వారికి సేవ కూడా చేయాలని ఆయన సూచించారు. డాక్టర్కు.. పేదవాడి ప్రాణం ఎంత ముఖ్యమో.. ధనవంతుడి ప్రాణం కూడా అంతే ముఖ్యమని మంత్రి పేర్కొన్నారు.