- మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడితే రూ.2.5 లక్షల పరిహారం
- బండి ఓనరే డబ్బులు చెల్లించాలి: కేంద్రం ప్రపోజల్
న్యూఢిల్లీ: మోటార్ వెహికిల్స్ యాక్టుకు మరింత పదునుపెట్టే సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్సభ ముందుకు తెచ్చింది. దీని ద్వారా రూల్స్ పాటించనివాళ్లకు భారీ ఫైన్లు విధించడంతోపాటు ప్రమాద సమయాల్లో సాయం చేసే వారికి రక్షణ కల్పించడానికి వీలవుతుంది. వీటితోపాటు యాక్సిడెంట్లో చనిపోయిన మృతుడి కుటుంబానికి రూ.5 లక్షలు, గాయపడ్డవారికి రూ.2.5లక్షల పరిహారాన్ని బైకు యజమానిగానీ, బీమా ద్వారాగానీ చెల్లించాల్సిఉంటుందని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఎంపీల అభ్యంతరాలకు సమాధానమిచ్చిన కేంద్ర ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ.. రాష్ట్రాల హక్కుల్ని లాక్కునే ఉద్దేశం కేంద్రానికి లేదని, యాక్సిడెంట్ల బారిన పడకుండా ఎక్కువ మంది ప్రాణాలు కాపాడటమే బిల్లు ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ కాలపరిమితిని మూడేండ్ల నుంచి ఐదేండ్లకు పెంచే ప్రతిపాదన బిల్లులో ఉందన్నారు.
కమర్షియల్ సరోగసీ రద్దు బిల్లు
దేశంలో కమర్షిల్ సరోగసీ విధానాన్ని నిషేధించేందుకు వీలుగా సరోగసీ (నియంత్రణ) బిల్లును-2019ని రూపొందించిన కేంద్రం దాన్ని సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టింది.