
- కేంద్రమంత్రి ఆర్కే సింగ్
ముషీరాబాద్, వెలుగు : పేదల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ కోరారు. శనివారం బాగ్ లింగంపల్లిలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. కేంద్ర పథకాలపై రూపొందించిన బుక్లెట్ను ఆయన రిలీజ్ చేశారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రవిచారి, అధికారులు పాల్గొన్నారు.