కరోనా తర్వాత గుండెపోటు మరణాలు మరింత ఎక్కువయ్యాయి. బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ నటించిన 'గదర్ 2' చూడటానికి వెళ్లిన 32 ఏళ్ల వ్యక్తి సినిమా హాలులో గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీలో చోటుచేసుకుంది. ఈ దృశ్యమంతా సినిమా హాలులో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. మృతుడు అష్టక్ తివారీగా గుర్తించారు. నివేదికల ప్రకారం, ఫోన్ కాల్లో ఎవరితోనో మాట్లాడుతూ మెట్లు ఎక్కిన తర్వాత అష్టక్ కుప్పకూలిపోయాడు. అది గ్రహించిన చుట్టుపక్కల వారు.. సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ASP) నైపాల్ సింగ్ తన ఫోన్ అన్లాక్ చేసి ఉందని, అందువల్ల గార్డ్లు, బౌన్సర్లు అతని కుటుంబాన్ని సంప్రదించగలిగారని తెలిపారు. అనంతరం ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం పోలీసులు విచారిస్తున్నారు. మృతుడు సదర్ కొత్వాలి ప్రాంతంలోని ద్వారకాపురి ప్రాంతంలో నివాసి.
అంతకుముందు, 'పాకిస్తాన్ జిందాబాద్' అని ఆరోపిస్తూ ఒక వ్యక్తిని కొట్టిన వ్యక్తుల గుంపు సోషల్ మీడియాలో వైరల్ అయింది. గతంలో ట్విటర్గా పిలిచిన ఎక్స్లో అప్లోడ్ చేసిన ఈ వీడియో ప్రజలను పూర్తిగా షాక్కు గురి చేసింది. సినిమా బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతుండగా ఒక గుంపు వ్యక్తిని కొట్టడం చూడవచ్చు. ఈ వీడియో అప్లోడ్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. "గదర్ 2 చూస్తున్నప్పుడు థియేటర్లో ఎవరో 'పాకిస్తాన్ జిందాబాద్' అని అరిచారని ఆరోపిస్తున్నారు" అని X యూజర్ 'బాలా' వీడియోను షేర్ చేస్తూ రాసుకువచ్చారు.
గదర్ 2 అనేది ఇటీవలి కాలంలో బాలీవుడ్లో వచ్చిన మోస్ట్ ఎవైటెడ్ మూవీస్లో ఒకటి. ఇది షారుఖ్ ఖాన్ పఠాన్ తర్వాత సంవత్సరంలో రెండవ అత్యధిక ఓపెనర్గా నిలిచింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అక్షయ్ కుమార్ OMG 2తో పోటీ పడింది కానీ దాన్ని అధిగమించింది. ఓ మై గాడ్ 2 తొలిరోజు రూ.9 కోట్లు వసూలు చేసిందని చెబుతున్నారు.