Upasana Konidela: తెలంగాణ గవర్నర్ను కలిసిన మెగా కోడలు ఉపాసన

Upasana Konidela: తెలంగాణ గవర్నర్ను కలిసిన మెగా కోడలు ఉపాసన

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల(Upasana Konidela) ఒకవైపు ఫార్మా బిజినెస్ రంగంలో బిజీగా ఉంటూనే మరోవైపు హెల్త్ మ్యాగజైన్ ను నడుపుతున్నారు. బి పాజిటివ్ పేరుతో ఇటీవలే ఓ మ్యాగజైన్ను స్థాపించి..దానికి చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

అలాగే ఒకపక్క మెగా కోడలిగా ఇంటి బాధ్యతలు చూసుకొంటూనే..ఇంకోపక్క అపోలో హాస్పిటల్ బాధ్యతలు నిర్వర్తిస్తుంది. అంతేకాకుండా క్లింకార రాకతో తల్లిగా ఉంటూనే ఇలాంటి పెద్ద బాధ్యతలను అన్ని విధాలుగా చూసుకుంటూ వెళ్తుండటం పట్ల ఉపాసన ప్రశంసలు అందుకుంటున్నారు.  

ఇక తాజాగా ఉపాసన..తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్( Tamilisai Soundararajan) ను మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ విషయాన్నీ ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపింది.

గౌరవనీయులైన తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారిని కలిశాను. గిరిజన సంక్షేమం కోసం ఆమె చేస్తున్న పనుల గురించి లోతైన అవగాహన పొందడం నిజంగా నా హృదయాన్ని తాకింది.మేడమ్, మీ అద్భుతమైన కృషికి  మీకు వందనాలు” అని తన ట్విట్టర్ లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఉపాసన గవర్నర్తో కలిసి ఉన్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ ఫోటోలు చూసిన మెగా ఫ్యాన్స్ సూపర్ మేడమ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.