- ఈ నెల 31వరకు అందుబాటులో ఆఫర్
- సోమవారం అర్ధరాత్రి వరకు వేసిన చలాన్స్కి వర్తింపు
- మాస్క్ వయోలేషన్కు 100 చెల్లిస్తే చాలు
హైదరాబాద్, వెలుగు: ట్రాఫిక్ చలాన్స్ క్లియరెన్స్ కోసం పోలీసులు వాహనదారులకు బంపర్ఆఫర్స్ప్రకటించారు. ఈ నెల 1 నుంచి 31వ తేదీ వరకు అన్ని రకాల చాలాన్స్ పై 50 నుంచి 80 శాతం డిస్కౌంట్స్ ఇస్తున్నట్లు వెల్లడించారు. సోమవారం రాత్రి వరకు విధించిన చలాన్స్కు ఈ డిస్కౌంట్స్వర్తిస్తాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏళ్ల తరపడి పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ చలాన్స్ క్లోజ్ అవుతాయని పోలీసులు భావిస్తున్నారు. లాక్డౌన్, కొవిడ్టైంలో మాస్క్వయోలేషన్చలాన్స్కి కూడా భారీ డిస్కౌంట్ ఇచ్చారు. వెయ్యి రూపాయలకు గానూ వంద చెల్లిస్తే చాలని స్పష్టం చేశారు. సోమవారం అర్ధరాత్రి నుంచి డిస్కౌంట్స్ అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్నిరకాల వెహికల్స్పై 6 కోట్ల చాలాన్లు పెండింగ్లో ఉండగా వాటి ద్వారా ప్రభుత్వానికి రూ.35 సర్వీస్ చార్జీతో కలిపి దాదాపు రూ.1,550 కోట్లు రావాల్సి ఉంది. కాగా ఫైన్లు ప్రతిఒక్కరూ ఆన్లైన్లోనే చెల్లించాల్సి ఉంది. ఈ–చలాన్ వెబ్సైట్,ఆన్లైన్ పేమెంట్ గేట్వేస్ ద్వారా ఫైన్లు కట్టొచ్చు. పోలీసులు ఏప్రిల్ నుంచి ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినతరం చేయనున్నారు.
ఉపయోగించుకోండి
కరోనా నేపథ్యంలోనే ఈ ఆఫర్ ఇచ్చాం. మార్చి 31 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఈ–చలాన్ సైట్, గూగుల్ పే, పేటీఎం ఇలాంటి పేమెంట్ గేట్ వేస్ ద్వారా చలాన్ అమౌంట్ క్లియర్ చేసుకోవచ్చు. అందరూ ఈ ఆఫర్ను వినియోగించుకోవాలి. ఏప్రిల్ 1 నుంచి స్పెషల్డ్రైవ్ నిర్వహిస్తాం. పెండింగ్ చలాన్లతో పట్టుబడే వారిపై చర్యలు ఉంటాయి.
– సీవీ ఆనంద్, సీపీ, హైదరాబాద్