న్యూయార్క్: ఇండియన్ అమెరికన్ స్టూడెంట్ అమెరికా ప్రతిష్టాత్మక క్విజ్లో గెలిచాడు. లక్ష డాలర్లు (సుమారు ₹69 లక్షలు) సొంతం చేసుకున్నాడు. అమెరికాలో ఎక్కువ మంది చూసిన క్విజ్ షో ‘2019 టీన్ జియోపార్డీ’ క్విజ్లో ఇండియాకు చెందిన అవి గుప్తా విన్నర్గా నిలిచాడు. ఒరెగాన్లోని పోర్ట్లాండ్ స్కూల్లో చదువుతున్న అతడు ‘టీన్ టోర్నమెంట్’ను గెలిచాడని క్విజ్ను నిర్వహించిన జియోపార్డీ ప్రకటించింది. గెలిచానంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని అన్నాడు. ఇంత మంచి అవకాశం వచ్చినందుకు, పోటీలో గెలిచినందుకు మాటలు కూడా రావట్లేదన్నాడు.
‘‘జియోపార్డీ నా జీవితంలో భాగం. మా కుటుంబంలో భాగం. మా నాన్నమ్మకు ఆ కార్యక్రమమంటే పిచ్చి” అని చెప్పాడు. తల్లిగా అతడు పోటీలో ఉన్నప్పుడు తన గుండె వేగంగా కొట్టుకుందని అతడి తల్లి నందితా గుప్తా చెప్పారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా దృఢంగా ఉండడమే అవికి పెద్ద బలమని చెప్పారు. కాగా, సియాక్స్ఫాల్స్కు చెందిన రయాన్ ప్రెస్లర్ అనే స్టూడెంట్ రెండో స్థానంలో నిలిచి 50 వేల డాలర్ల (రూ.34.47 లక్షలు) రన్నరప్ ప్రైజ్ను అందుకున్నాడు. మయామికి చెందిన లూకస్ మైనర్ అనే అబ్బాయి మూడో స్థానంలో నిలిచాడు. 25 వేల డాలర్లు (రూ.7.23 లక్షలు) గెలుచుకున్నాడు.