చైనాతో పోరాటంలో మేమూ భాగస్వాములం అవుతాం

 చైనాతో పోరాటంలో మేమూ భాగస్వాములం అవుతాం

తైపి: తైవాన్​కు అమెరికా మద్దతు ఎప్పుడూ ఉంటుందని, చైనాతో పోరాటంలో తాము కూడా భాగస్వాములు అవుతామని యూఎస్​ హౌస్​ స్పీకర్​ నాన్సీ పెలోసీ అన్నారు. మంగళవారం రాత్రి తైవాన్​లో అడుగుపెట్టిన ఆమె.. బుధవారం ఉదయం ఆ దేశ అధ్యక్షురాలు త్సాయి యింగ్​ వెన్​తో భేటీ అయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమవేశంలో నాన్సీ మాట్లాడారు. చైనా ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు.

తైవాన్​కు అమెరికా అండగా ఉందని నిరూపించేందుకు టీంతో కలిసి ఇక్కడికి వచ్చినట్టు తెలిపారు. కాగా, నాన్సీ పర్యటన కారణంగా చైనా తమపై ఒత్తిడి పెంచిందని తైవాన్​ ప్రెసిడెంట్​ త్సాయి యింగ్​ చెప్పారు. అయితే, బెదిరింపులకు తలొగ్గేదిలేదని ఆమె స్పష్టం చేశారు. మరోవైపు, చైనాను అవమానపర్చేలా వ్యవహరిస్తే.. ఏ దేశాన్ని అయినా శిక్షిస్తామని చైనా ఫారెన్​ మినిస్టర్​ వాంగ్​ యి తేల్చిచెప్పారు.