టాప్లో అజిత్రోమైసిన్: లాన్సెట్ స్టడీ
న్యూఢిల్లీ: ఇండియన్లు అధిక మోతాదులో యాంటీబయోటిక్స్ వాడుతున్నారని లాన్సెట్స్టడీలో బయటపడింది. కరోనాకు ముందు, కరోనా టైమ్లో ఈ యాంటీబయోటిక్స్ను మనోళ్లు చాలా ఎక్కువగా వాడారని తేల్చింది. ఇండియన్లు వాడిన డ్రగ్స్లో ఎక్కువగా కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థల ఆమోదం పొందలేదని లాన్సెట్ పరిశోధకులు చెప్పారు. విచ్చలవిడిగా సాగుతున్న యాంటీబయోటిక్స్ వాడకాన్ని నియంత్రించేందుకు ఓ విధానం అవసరమని సూచించారు. యాంటీబయోటిక్స్ వాడకం ఇట్లనే కొనసాగితే జనాలలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని హెచ్చరించింది. ‘‘ జాతీయ, రాష్ట్ర స్థాయిలో నియంత్రణ సంస్థల మధ్య సమన్వయంలేక యాంటీబయోటిక్స్ వాడకం బాగా పెరిగింది. ఇండియాలో 2019లో 5,071 మిలియన్ల డ్రగ్స్ వినియోగం జరిగినట్లు ఫార్మా ట్రాక్ కంపెనీ డేటాతో తెలుసుకున్నాం. వాటిలో 640 మిలియన్డోసులతో అజిత్రోమైసిన్ టాప్లో ఉంది” అని లాన్సెట్ పరిశోధకులు తెలిపారు.