నల్గొండ జిల్లా నుంచి తొలి ఇరిగేషన్​ మంత్రిగా ఉత్తమ్​ కుమార్​ రెడ్డి

నల్గొండ జిల్లా నుంచి తొలి ఇరిగేషన్​ మంత్రిగా ఉత్తమ్​ కుమార్​ రెడ్డి
  • ఆర్అండ్‌బీ శాఖకు రెండో  మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి
  • ఎన్టీఆర్​ కేబినెట్‌లో ఆర్​అండ్ బి శాఖ మంత్రిగా పనిచేసిన జానారెడ్డి

నల్గొండ, వెలుగు: ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీనీటి పారుదల, పౌరసరఫరాల శాఖలకు మొదటి మంత్రిగా నలమాద ఉత్తమ్​ కుమార్​ రెడ్డి రికార్డుకెక్కారు. గతంలో ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి,  కుందూరు జానారెడ్డి చిన్న నీటి వనరుల శాఖలకు మంత్రులుగా పనిచేశారు. కానీ తొలిసారిగా భారీనీటి పా రుదల శాఖ మంత్రిగా ఉత్తమ్​ బాధ్యతలు చేపట్టనున్నారు. గతంలో మాజీ సీఎం కిరణ్​ కుమార్​ రెడ్డి కేబినెట్​లో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేసిన ఉత్తమ్ కోదాడలో రెండు సార్లు, హుజూర్​నగర్​లో వరుసగా నాలుగు సార్లు ఎమ్మె ల్యేగా గెలుపొందారు. ఇక రోడ్లు, భవనాల శాఖకు రెండో మంత్రిగా కోమటిరెడ్డికి చాన్స్ కొట్టేశారు. 1985లో ఎన్టీఆర్​ కేబినెట్‌లో జానారెడ్డి 12శాఖలకు మంత్రిగా పనిచేశారు.

వాటిల్లో రవాణా, ఆర్‌‌అండ్‌బీ, చిన్న నీటి వనరుల శాఖలు కూడా ఉన్నాయి. మాజీ సీఎంలు డాక్టర్​ వై.ఎస్​.రాజశేఖ ర్ రెడ్డి,  రోశయ్య మంత్రివర్గంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఐటీ, యువజన సర్వీసులు, క్రీడల శాఖలకు మంత్రిగా పనిచేశారు. మళ్లీ కిరణ్​కుమార్​రెడ్డి మంత్రి వర్గంలో పెట్టు బడులు, మౌలిక వసతులు, ఓడరేవుల శాఖ మంత్రిగా సేవలందించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 2011లో మంత్రి పదవి వదులుకున్నారు. మళ్లీ ఇన్నాళ్లకు సీఎం రేవంత్​ రెడ్డి కేబినెట్​లో ఆర్‌‌అండ్‌బీ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా అవకాశం వచ్చింది