న్యూఢిల్లీ: వ్యాక్సిన్ తీసుకోని వారితోపాటు టీకా తీసుకున్న వారు కూడా కరోనా జాగ్రత్తలు తప్పక పాటించాలని కేంద్రం స్పష్టం చేసింది. టీకా తీసుకున్నా కూడా మాస్కులు ధరిస్తూ, సామాజిక దూరాన్ని పాటించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది ఈ మేరకు కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వ చీఫ్ సైంటిస్ట్ కే రాఘవన్ పలు సూచనలు చేశారు. 'టీకా వేయించుకున్నా లేకపోయినా సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం, మాస్కులు కట్టుకోవడాన్ని మరవొద్దు' అని విజయ్ రాఘవన్ ట్వీట్ చేశారు. కరోనా పరిస్థితి తీవ్రంగా ఉన్న ఈ సమయంలో పైజాగ్రత్తలను పాటించడం చాలా ఉపయోగకరం అన్నారు. ఇది దేశ ఆరోగ్య వ్యవస్థ మీద ఒత్తిడిని, పని భారాన్ని తగ్గిస్తుందని ఆయన తెలిపారు.
Very important, whether vaccinated or not: Masks, physical distancing, ventilation. These interventions are also immediately critical for lowering pressures on the healthcare system, during this surge. Adherence essential at the personal and community levels. By all.
— Principal Scientific Adviser, Govt. of India (@PrinSciAdvGoI) May 15, 2021