వైష్ణవి చైతన్యకు క్రేజీ ఆఫర్స్..

వైష్ణవి చైతన్యకు క్రేజీ ఆఫర్స్..

వైష్ణవి చైతన్య.. ‘బేబీ’ చిత్రంతో ఓవర్ నైట్‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌గా ఎదిగింది. తెలుగు అమ్మాయిగా తనదైన యాక్టింగ్‌‌‌‌తో అందర్నీ ఆకట్టుకుంది. అంతకుముందు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించినా, ఈ సినిమా తన కెరీర్‌‌‌‌‌‌‌‌లోనే మైల్ స్టోన్‌‌‌‌గా మిగిలిపోతుంది. సక్సెస్‌‌‌‌తో పాటు మంచి పేరును కూడా తెచ్చిపెట్టింది ఈ చిత్రం. తాజాగా ఆమెకు కొన్ని క్రేజీ ఆఫర్స్ వచ్చినట్టు, ఇప్పటికే  మూడు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే ప్రచారం జరుగుతోంది. 

పూరిజగన్నాథ్ దర్శకత్వంలోనూ తనకు చాన్స్ వచ్చిందనే న్యూస్ వినిపిస్తోంది. అయితే వీటిలో ఏ మాత్రం నిజం లేదని ఆమె క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం స్ర్కిప్టులు అయితే వస్తున్నాయి కానీ, ఏ ప్రాజెక్టుని ఫైనల్ చేయలేదని చెప్పింది. ఇదిలా ఉంటే మూడు రోజుల నుంచి ఆహాలో స్ట్రీమ్ అవుతున్న ‘బేబీ’ చిత్రానికి ఓటీటీలోనూ మంచి ఆదరణ దక్కుతోంది.  32 గంటల్లో వంద మిలియన్ వ్యూస్  రాబట్టి బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది.