అధికారులు పారదర్శకంగా పని చేయలన్న వాకిటి శ్రీహరి

అధికారులు పారదర్శకంగా పని చేయలన్న వాకిటి శ్రీహరి

నర్వ, వెలుగు: అధికారులు పారదర్శకంగా పని చేసి మండలాభివృద్ధికి పాటుపడాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సూచించారు. బుధవారం ఎంపీపీ జయరాం శెట్టి అధ్యక్షతన మండల సర్వ సభ్య సమావేశం జరిగింది. ముందుగా సమావేశానికి వచ్చిన ఎమ్మెల్యేను అధికారులు, ప్రజాప్రతినిధులు సన్మానించారు. తాము గ్రామాల్లో చేసిన పనులకు బిల్లులు రాలేదని, వాటిని ఇప్పించాలని పలువురు సర్పంచులు కోరారు.

స్పందించిన ఎమ్మెల్యే పెండింగ్  బిల్లులు పరిశీలించి వాటిని చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు పార్టీలకతీతంగా పని చేయాలని ఆదేశించారు. అనంతరం కాంగ్రెస్  పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. వైస్ ఎంపీపీ వీణవతి శంకర్. జడ్పీటీసీ గౌని జ్యోతి కిరణ్ ప్రకాశ్ రెడ్డి. ఎంపీడీవో సుదర్శన్, తహసీల్దార్ మల్లారెడ్డి పాల్గొన్నారు.