బీఆర్ఎస్ సర్పంచ్ వరలక్ష్మి రాజేందర్రెడ్డి కాంగ్రెస్ లో చేరిక

బీఆర్ఎస్  సర్పంచ్  వరలక్ష్మి రాజేందర్రెడ్డి కాంగ్రెస్ లో చేరిక

ఆమనగల్లు, వెలుగు: తలకొండపల్లి మండలం జంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్  సర్పంచ్  వరలక్ష్మి రాజేందర్ రెడ్డి శుక్రవారం ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి సమక్షంలో కాంగ్రెస్  పార్టీలో చేరారు.

గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న కసిరెడ్డి సమక్షంలో మాజీ సర్పంచ్  జంగయ్య, బీఆర్ఎస్  నాయకులతో కాంగ్రెస్ లో చేరారు. వైస్  ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీలు రమేశ్, అంబాజీ, రఘునాయక్, సర్పంచులు రమేశ్ యాదవ్, వెంకట్రాంరెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి, ఎల్లమ్మ, తిరుపతయ్య, నరసింహ, ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.