తిరుపతి: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సతీమణి వసుమతిదేవి (67) కన్నుమూశారు. గత కొన్ని రోజలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను తిరుపతిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. అయితే గుండెపోటు రావడంతో ఈ రోజు చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా రేపు ఉదయం నగరి నియోజకవర్గంలోని ఐనంబాక గ్రామంలో వసుమతిదేవి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నారాయణ సతీమణి మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.