వీరబ్రహ్మేంద్రస్వామి జయంతిని అధికారికంగా జరపాలి..ఎమ్మెల్సీ మధుసూదనాచారి

వీరబ్రహ్మేంద్రస్వామి జయంతిని అధికారికంగా జరపాలి..ఎమ్మెల్సీ మధుసూదనాచారి

ట్యాంక్ బండ్, వెలుగు: పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 417వ జయంతి ఉత్సవాలు ఆదివారం ట్యాంక్ బండ్​లో ఘనంగా జరిగాయి. పోతులూరి విగ్రహానికి ఎమ్మెల్సీ మధుసూదనాచారి, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్ చారి దీపారాధన చేసి మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వీరబ్రహ్మేంద్రస్వామి వర్ధంతి, జయంతి ఉత్సవాలను ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని డిమాండ్​ చేశారు. విశ్వబ్రాహ్మణులను ఆదుకోవాలని కోరారు. మొంథా తుఫాను ప్రభావంతో కడపలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఇల్లు కూలిపోయిందని, దీనిని ఏపీ ప్రభుత్వం వెంటనే పునర్నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. తాటికొండ శ్రీనివాస్ చారి, నరసింహ చారి తదితరులు పాల్గొన్నారు.