
స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించిన దుర్గేష్ కుమార్
పదవతరగతిలో ఫలితాల్లో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించాడు ఓ కూరగాయల రైతు కొడుకు. బీహార్ సమస్తిపూర్కు చెందిన దుర్గేష్ కుమార్ కూరగాయల రైతు కుమారుడు. తండ్రి కష్టపడి కొడుకును చదివిస్తున్నాడు. ఆ తండ్రి కష్టానికి ప్రతిఫలం దక్కింది. దుర్గేష్ ప్రస్తుతం టెన్త్ పూర్తిచేశాడు. బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు పదవ తరగతి పరీక్ష ఫలితాలను మంగళవారం ప్రకటించింది. ఆ ఫలితాల్లో దుర్గేష్ 480 మార్కులు సాధించి రెండో స్థానంలో నిలిచాడు. రోహ్తాస్ జిల్లాకు చెందిన హిమాన్షు రాజ్ 481 మార్కులతో మొదటి స్థానాన్ని సాధించాడు. హిమాన్షు 96.2% మార్కులతో మొదటిస్థానంలో నిలవగా.. 96.1% మార్కులతో దుర్గేష్ రెండో స్థానంలో నిలిచాడు.
విద్యార్థులు తమ ఫలితాలను biharboardonline.com ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చని బోర్డు తెలిపింది. ఈ పరీక్షలకు మొత్తం 14,94,071 మంది విద్యార్థులు హాజరుకాగా.. అందులో 2,89,692 మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. దాంతో బీఎస్ఇబీ ఉత్తీర్ణత శాతం 80.59 శాతంగా నమోదయింది.
For More News..