పోలుమళ్ల గ్రామంలోని స్కూల్‌‌‌‌‌‌‌‌లోకి పాములు

పోలుమళ్ల గ్రామంలోని స్కూల్‌‌‌‌‌‌‌‌లోకి పాములు

సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం పోలుమళ్ల గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం పాములు కలకలం రేపాయి. స్కూల్​లోని క్లాస్​ రూమ్స్​లో పాములు కనిపించడంతో విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. ఉపాధ్యాయులు వెంటనే అప్రమత్తమై విద్యార్థులను సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు. కట్ల, రక్త పింజరి వంటి విషపూరితమైనవిగా పాము పిల్లలుగా గుర్తించారు. 

స్కూల్​ ఆవరణలో విష సర్పాలు కనిపించడంతో పేరెంట్స్​ ఆందోళన చెందుతున్నారు. పాత క్లాస్‌‌‌‌‌‌‌‌రూమ్‌‌‌‌‌‌‌‌ల గోడలు పూర్తిగా పగుళ్లు తేలడం, పైకప్పు శిథిలావస్థకు చేరుకోవడంతో పాములు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.