కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న ఆయన ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయానికి చేరుకున్న వెంకయ్యనాయుడికి.. మహాద్వారం వద్ద టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ స్వాగతం పలికారు. ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు ఉపరాష్ట్రపతికి వేదాశీర్వచనం అందించారు. ఆలయ ఈవో స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రముఖులు, ప్రజాప్రతినిధులు ఏడాదికి ఒక్కసారే స్వామివారిని దర్శించుకోండి. దీనివల్ల సామాన్య భక్తులకు శ్రీవారిని దర్శించుకునే అవకాశం లభిస్తుందని సూచించారు. తిరుమలకు ఎన్నిసార్లు వచ్చినా నిత్య నూతన ఉత్సాహం కలుగుతూ ఉంటుంది. హిందూ ధర్మ పరిరక్షణ, భారతీయ సాంప్రదాయాలను కొనసాగిస్తూ ప్రపంచానికి అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఆలయంలో టీటీడీ ఏర్పాట్లు బాగున్నాయన్నారు వెంకయ్యనాయుడు.
సతీమణి శ్రీమతి ఉషమ్మ, కుమారుడు శ్రీ హర్షవర్ధన్, కోడలు శ్రీమతి రాధమ్మ సహా ఇతర కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు. భారతీయ సంస్కృతిని, హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలని ప్రజలకు పిలుపు. #tirumalatemple pic.twitter.com/mv2CdqlpJV
— Vice President of India (@VPSecretariat) February 10, 2022
మరిన్ని వార్తల కోసం
సీఎం జగన్ తో టాలీవుడ్ హీరోల సమావేశం
చిరు వ్యాపారులను దోచుకుంటున్న డిజిటల్ పేమెంట్ సంస్థలు