147 సీట్లతో అధికారంలోకి వైసీపీ.. ఒప్పుకున్న టీడీపీ.. వీడియో వైరల్..

147 సీట్లతో అధికారంలోకి వైసీపీ.. ఒప్పుకున్న టీడీపీ.. వీడియో వైరల్..

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలకు నెలరోజుల సమయం కూడా లేకపోవటంతో రాష్ట్రంలో ఎన్నికల హడావిడి పీక్స్ కి చేరింది. ప్రచారాన్ని ముమ్మరం చేసిన పార్టీల నేతలు ఎవరి లెక్కలు వారు వేసుకుంటూ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఓ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో టీడీపీ స్టేట్ ఎలక్షన్ సెల్ కో ఆర్డినేటర్ కోనేరు సురేష్, ఓ ప్రెజెంటేషన్ ఇస్తూ వచ్చే ఎన్నికల్లో వైసీపీ 147సీట్లతో అధికారంలోకి రానుందని చెప్పటం హాట్ టాపిక్ గా మారింది.

వివరాల్లోకి వెళితే, 147 నియోజకవర్గాల్లో 2శాతం ఓట్ల తేడాతో వైసీపీనే ముందంజలో ఉందని తేలినట్లు వివరిస్తున్నారు సురేష్. 28 నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసినా కూడా వైసీపీ 10లక్షల ఓట్లతో ముందంజలో ఉందని అంటున్నారు. ఈ వీడియోను వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ చేస్తున్నారు. ఏ మాటకా మాట, ఎన్నికల పట్ల రాష్ట్రంలో తీవ్ర ఉత్కంఠ నెలకొన్న సమయంలో  ఈ వీడియో వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిందని చెప్పాలి. మరి, ప్రతిపక్ష టీడీపీ దీనిని ఎలా డిఫెన్స్ చేసుకుంటుందో వేచి చూడాలి.