దేశ సరిహద్దులో డ్యూటీ చేస్తున్న వారితో టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ కొంత సమయాన్ని గడిపారు. విజయ్ దేవరకొండతో ఓఛానల్ ప్రత్యేకంగా నిర్వహించిన జై జవాన్ అనే ఓ కార్యక్రమంలో భాగంగా వారిని కలిశారు. ఈ ఇప్పటికే పలు ప్రోమోలతో ఈ కార్యక్రమంపై మంచి అసక్తి ఏర్పరచగా దీపావళి సందర్భంగా ఈ కార్యక్రమం ఫుల్ ఎపిసోడ్ విడుదల అయ్యింది.
ఈ ఎపిసోడ్ లో ఉరి బార్డర్ లో డ్యూటీ చేస్తున్న జవాన్ లను కలిసి వారి విధి విధానాలు, డ్యూటీలో వున్న వారి సాధకబాధలను విజయ్ దేవరకొండ తెలుసుకున్నారు. వారితో కలిసి కొన్ని యుద్ధ మెళకువలు నేర్చుకున్నారు. ఫైరింగ్, బోటింగ్ ఎలా చేయాలి అన్న విషయాలను నేర్చుకున్నారు. అంతేకాదు సరదాగా ఆటలాడుతూ వారిని ఉల్లాసపరిచారు. చివరిగా జవాన్లతో కలిసి విజయ్ దేవరకొండ చిందులు వేశారు. ఆయన నటించిన లైగర్ సినిమాలోని డైలాగ్ ను చెప్పి అందరిలో నూతనోత్తేజాన్ని నింపారు.