
న్యూఢిల్లీ: పాథాలజీ సేవలు అందించే పుణెకు చెందిన పీహెచ్ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ను రూ. 134.65 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు విజయ డయాగ్నోస్టిక్ తెలిపింది. మంగళవారం జరిగిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో కంపెనీ, పీహెచ్ డయాగ్నోస్టిక్ సెంటర్ దాని ప్రమోటర్లు/షేర్హోల్డర్లు విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ కొనుగోలు చేయడానికి ఉద్దేశించిన వాటా కొనుగోలు ఒప్పందం నిబంధనలు షరతులను పరిశీలించి ఆమోదించారని సంస్థ రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది.
పీహెచ్ ప్రస్తుత వాటాదారుల నుంచి 100 శాతం వాటాల కొనుగోలు ఖర్చు 134.65 కోట్ల రూపాయలు అయింది. ఇప్పటికే ఉన్న రుణాన్ని చెల్లించడానికి ఈక్విటీ లేదా లోన్ ద్వారా రూ. 12.85 కోట్లను ఇందులోకి చేర్చుతారు. డీల్ పూర్తయిన తర్వాత పీహెచ్.. విజయకు పూర్తిగా అనుబంధ సంస్థగా మారుతుంది. పీహెచ్కు పూణేలో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ డయాగ్నస్టిక్ సెంటర్ ఉంది. ఇది ఎంఆర్ఐ/సీటీ వంటి అధునాతన రేడియాలజీ, ఈసీజీ, ఎక్స్–రే వంటి ప్రాథమిక రేడియాలజీ సేవలను అందిస్తోంది.