సంక్రాంతికి విడుదలైన F2 తో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న అనిల్ రావిపూడి. గతంలో చేసిన సినిమాలు కూడా మంచి విజయాన్ని సాధించాయి. ఇప్పుడు “సరిలేరు నీకెవ్వరు” అంటూ మహేష్ బాబు తో అనిల్ తెరకెక్కిస్తున్న సినిమాలో..ఓ క్యారెక్టర్ లో విజయశాంతి నటిస్తోంది. అనిల్ కూడా ప్రత్యేకంగా తను రాసుకున్న కథకు విజయశాంతి అయితేనే పర్ఫెక్ట్ ఛాయిస్ అని ఫిక్సైపోయాడు. దాంతో ఆమె తప్ప మరో నటి ఈ పాత్రకు ఛాయిస్ లేదు కాబట్టి అడిగినంత పారితోషికం కూడా ఇవ్వడానికి రెడీ అయ్యారంట. ముందుగా ఈ పాత్రలో నటించడానికి విజయశాంతి కోటిన్నర అడుగుతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.
చివరికి కోటి పాతిక వరకు సెటిల్ మెంట్ చేసినట్లు సమాచారం. ఇక ఇదే సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న రష్మిక మందన్నకు విజయశాంతి కంటే తక్కువ.. అంటే కోటి వరకు ఇస్తున్నట్లు తెలుస్తోంది. కెరీర్లో గ్యాప్ వచ్చిన రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం టాప్ లోనే ఉంది విజయశాంతి.