- ఆయనకు మరింత మంచి బాధ్యత దక్కుతుంది: విజయశాంతి
హైదరాబాద్, వెలుగు: ‘‘పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ మార్పు బాధాకరమే.. అయినా మరింత మంచి బాధ్యతను బీజేపీ హైకమాండ్ ఆయనకు అప్పగిస్తుందని భావిస్తున్న” అని పార్టీ సీనియర్ నేత విజయశాంతి అన్నారు. దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే తమ పార్టీ కార్యకర్తల మనోభావాలను బీజేపీ అధిష్టానం గుర్తిస్తుందని విశ్వసిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.