భగీరథ పైప్‌‌ పగిలి నీళ్లొస్తలేవ్

భగీరథ పైప్‌‌ పగిలి నీళ్లొస్తలేవ్

హూజుర్ నగర్, వెలుగు :  మిషన్ భగీరథ పైప్‌‌ పగిలిపోవడంతో తాగునీళ్లు రావడం లేదని హుజూర్ నగర్ మండలం బూరుగడ్డ గ్రామస్తులు మండిప్డడారు. మంగళవారం  ఖాళీ బిందెలతో నిరసన  తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో 15 రోజులుగా  మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని వాపోయారు.

 సత్తెమ్మ తల్లి గుడి ఎదురుగా పైపులైను పగలడంతో నీళ్లన్నీ వృథాగా పోతున్నాయన్నారు. ఈ విషయాన్ని  అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఉన్నతాధికారులు స్పందించి పైప్‌‌లైన్‌‌కు రిపేర్ చేయాలని కోరారు.