మాకూ దళితబంధు ఇవ్వండి.. వాటర్ ట్యాంక్ ఎక్కి గ్రామస్థుల నిరసన

మాకూ దళితబంధు ఇవ్వండి.. వాటర్ ట్యాంక్ ఎక్కి గ్రామస్థుల నిరసన

మహబూబాబాద్ జిల్లా నెల్లికదురు మండలం రావిరాల గ్రామంలో ఉద్రక్తత నెలకొంది. అర్హులైన వారికే దళితబంధు ఇవ్వాలని గ్రామంలోని దళితులంతా కలసి వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. దళిత బంధు ఇవ్వాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్రామంలోని ప్రతీ కుటుంబానికి దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. 

ఈ క్రమంలో గ్రామస్థులకు పోలీసులకు మధ్య గొడవ జరిగింది. దళిత బంధు ఇచ్చేవరకు వాటర్ ట్యాంక్ దిగమని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు దళితులకు మధ్య తోపులాట జరిగింది.