మెదక్(శివ్వంపేట)/ కంగ్టి , వెలుగు: అధ్వానంగా మారిన రోడ్లను ఆఫీసర్లు, లీడర్లు పట్టించుకోకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు చాలా రోడ్లు బురదమయంగా మారడంతో కాలినడకన సైతం వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో బురదమయంగా మారిన రోడ్లపై గ్రామస్తులు నాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం రెడ్యా తండా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న వెంక్యా తండా, రూప్ సింగ్ తండాకు మట్టి రోడ్డు ఉంది. రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆ రోడ్లు చిత్తడిగా మారాయి. శనివారం ఆయా తండా వాసులు బురదమయంగా మారిన రోడ్లపై వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. ఇప్పటికైనా స్పందించి తమ తండాలకు రోడ్డు సౌకర్యం మెరుగుపర్చాలని సర్పంచ్ రంగీలా కోరారు. కంగ్టి మండల పరిధిలోని వాచు తండాలోని రోడ్లపై కూడా నాట్లు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎల్హెచ్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకాశ్ రాథోడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తండాలను చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు. వెంటనే తండాలకు రోడ్లు వేయించాలని డిమాండ్ చేశారు.
రోడ్లపై నాటేసి నిరసన తెలిపిన్రు
- తెలంగాణం
- July 10, 2022
లేటెస్ట్
- GT vs RCB: కోహ్లీ, డుప్లెసిస్ బాదుడే బాదుడు.. బెంగుళూరు చేతిలో చిత్తయిన గుజరాత్
- ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాన్వాయ్పై ఉగ్రదాడి
- మీటింగ్లోనే కాంగ్రెస్ కార్యకర్తని వెంటాడి చంపిండు
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- Health Alert : ఈ కాలంలో ప్రతి ఇంట్లో ఉండాల్సిన మెడికల్ కిట్ ఇదే..
- కేసీఆర్ 20 వేల ఎకరాలు దండుకుండు: వివేక్ వెంకటస్వామి
- జగన్ మెడకు ఉరేసే అవకాశం వచ్చింది.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..
- దానం నాగేందర్ ను కేంద్ర మంత్రిని చేసే బాధ్యత నాది : సీఎం రేవంత్ రెడ్డి
- GT vs RCB: మెరిసిన బెంగళూరు బౌలర్లు.. స్వల్ప స్కోరుకే గుజరాత్ ఆలౌట్
- సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ తనిఖీ
Most Read News
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- రోడ్లు ఇక వాటికవే రిపేర్లు చేస్కుంటయ్ .. కొత్త టెక్నాలజీపై ఎన్హెచ్ఏఐ ఫోకస్
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- పాత కారును వదిలేసుకుంటే .. కొత్తదానిపై రాయితీ
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు