"వినరో భాగ్యము విష్ణుకథ" విడుదలకు ముహుర్తం ఖరారు

"వినరో భాగ్యము విష్ణుకథ" విడుదలకు ముహుర్తం ఖరారు

రాజావారు రాణిగారు, ఎస్.ఆర్ కల్యాణమండపం, నేను మీకు బాగా కావాల్సినవాడిని వంటి చిత్రాలతో కిరణ్ అబ్బవరం మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ యంగ్ హీరో వరుస సినిమాలకు పచ్చజెండా ఊపుతున్నాడు. ప్రస్తుతం కిరణ్‌ అబ్బవరం, కశ్మీర పరదేశి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘వినరో భాగ్యము విష్ణుకథ’. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని 2023, ఫిబ్రవరి 17న రిలీజ్ కు మేకర్స్ సిద్ధం చేస్తున్నారు. 

ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై బన్నీవాసు నిర్మిస్తుండగా..మెగా నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. మురళీ కిషోర్‌ అబ్బురూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి చేత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం స‌మ‌కూర్చుతున్నాడు. విలేజ్‌ డ్రామా నేపథ్యంలో సాగనున్న ఈ సినిమా ఫిబ్రవరి 17న విడుదలకానున్నట్లు చిత్రబృందం అధికారిక ప్రకటన చేశారు.