న్యూఢిల్లీ: ఇండియా స్టార్ రెజ్లర్లు బజ్రంగ్ పునియా, వినేశ్ ఫొగాట్కు ఆసియా గేమ్స్ ట్రయల్స్ నుంచి మినహాయింపు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ యంగ్స్టర్స్ అంటిమ్ పంఘల్, సుజీత్ కల్కాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆసియా గేమ్స్ కోసం న్యాయమైన సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించాలని కోరుతూ ఈ ఇద్దరూ ఇచ్చిన పిటిషన్పై గురువారం విచారణ జరగనుంది.
బజ్రంగ్, వినేశ్ను ఐఓఏ అడ్అక్ కమిటీ నేరుగా ఆసియా గేమ్స్కు ఎంపిక చేయడాన్ని లెజెండరీ రెజ్లర్ యోగేశ్వర్ దత్, డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ తప్పు పట్టారు. అడ్అక్ కమిటీ నిర్ణయంపై వ్యతిరేకత రావడంతో ఐఓఏ స్పందించింది. బలమైన జట్టును పంపే విధంగా ఆసియా గేమ్స్ కోసం రెజ్లింగ్ టీమ్ చైనా బయల్దేరే ముందు తుది విశ్లేషణ చేస్తామని ప్రకటించింది.