గువాహటి వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతోన్న తొలి వన్డే మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అదరగొడుతున్నాడు. ఈ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసిన కోహ్లీ ఏకంగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. కేవలం 257 మ్యాచ్ లో 12,500 పరుగులు పూర్తి చేసి కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు. ఇక కోహ్లీ తరువాత సచిన్ (310 మ్యాచ్ ల్లో) , రిక్కీ పాటింగ్ (328 మ్యాచ్ ల్లో) 12,500 పరుగులు చేశారు. దీంతో వన్డేల్లో అత్యంత వేగంగా 12,500 పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ చరిత్ర సృష్టించాడు.
ఇక ఈ మ్యాచ్ లో కనుక కోహ్లీ సెంచరీ చేస్తే సచిన్ పేరిట ఉన్న మరో రికార్డును సమం చేసినవాడు అవుతాడు. స్వదేశంలో సచిన్ 20 సెంచరీలు సాధించగా, విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 19 సెంచరీలు చేశాడు. ఇక వన్డే ఫార్మాట్లో లంకపై సచిన్ 8 సెంచరీలు చేయగా కోహ్లీ కూడా ఎనిమిది సెంచరీలను చేసి సమంగా ఉన్నాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ సెంచరీ చేస్తే లంకపై 9 శతకాలు సాధించిన బ్యాటర్గా నిలుస్తాడు.ప్రస్తుతం కోహ్లీ 81 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు.