మ్యాచ్ తర్వాత గొడవ పడ్డ కోహ్లీ,గంభీర్

మ్యాచ్ తర్వాత గొడవ పడ్డ కోహ్లీ,గంభీర్

లక్నో:  ఆర్‌‌సీబీ స్టార్‌‌ కోహ్లీ, లక్నో మెంటార్‌‌ గౌతమ్‌‌ గంభీర్‌‌ గ్రౌండ్‌‌లో గొడవ పడ్డారు. ఇద్దరూఒకరి మీదికి మరొకరు దూసుకెళ్లారు. చిన్నస్వామి స్టేడియంలో ఏప్రిల్‌‌10 జరిగిన మ్యాచ్‌‌లో ఆర్‌‌సీబీపై  లక్నో గెలిచిన తర్వాత ఫ్యాన్స్‌‌ను సైలెంట్‌‌గా ఉండాలంటూ గంభీర్‌‌ హెచ్చరించాడు. సోమవారం సూపర్‌‌ జెయింట్స్‌‌తో మ్యాచ్‌‌ సందర్భంగా కోహ్లీ.. స్టేడియంలోని ఫ్యాన్స్‌‌ను సైలెంట్‌‌గా ఉండొద్దు.. సందడి చేయాలంటూ గంభీర్‌‌కు కౌంటర్‌‌ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈ విషయంలోనే మ్యాచ్​ తర్వాత కోహ్లీ, గౌతీ మధ్య గొడవ అయినట్టు తెలుస్తోంది.