హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టీ20 వరల్డ్కప్ తర్వాత టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని ఇటీవల ప్రకటించిన విరాట్.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్సీకి కూడా వీడ్కోలు పలికాడు. యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్ 14 ఎడిషన్ ఫేజ్–2 తర్వాత ఆర్సీబీ కెప్టెన్గా తప్పుకుంటానని ఆదివారం వెల్లడించాడు. అయితే, ప్లేయర్గా ఆర్సీబీలోనే కొనసాగుతానని స్పష్టం చేశాడు. ‘ఆర్సీబీ కెప్టెన్గా నాకు ఇదే చివరి ఐపీఎల్. ఎంతో ఆలోచించి టీమ్ అందరితో మాట్లాడిన తర్వాతే ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నా. గతంలో చెప్పినట్టుగానే నా చివరి ఐపీఎల్ మ్యాచ్ వరకు ఆర్సీబీలో ప్లేయర్గా కొనసాగుతా. చాలామంది టాలెంటెడ్ ప్లేయర్లున్న ఆర్సీబీ జట్టును కెప్టెన్గా నడిపించిన నా ప్రయాణం చాలా గొప్పగా సాగింది. ఈ అవకాశం నాకిచ్చిన ఆర్సీబీ మేనేజ్మెంట్, కోచ్లు, సపోర్ట్ స్టాఫ్, ప్లేయర్లుకు థ్యాంక్స్. నాపై నమ్మకంతో నన్ను సపోర్ట్ చేసిన ఆర్సీబీ ఫ్యాన్స్కు కూడా థ్యాంక్స్’ అని కోహ్లీ చెప్పాడు. కాగా, 2013లో ఆర్సీబీ పగ్గాలు అందుకున్న విరాట్ కోహ్లీ...ఇప్పటిదాకా 132 మ్యాచ్ల్లో జట్టును నడిపించాడు. ఇందులో 65 మ్యాచ్ల్లోనే జట్టును గెలిపించగలిగాడు. కాగా, విరాట్ నాయకత్వంలోని ఆర్సీబీ ఇప్పటిదాకా ఐపీఎల్ టైటిల్ గెలవలేదు. మూడు సార్లు ఫైనల్లో ఓడింది. మరో మూడుసార్లు ప్లే ఆఫ్స్ వరకు వచ్చింది. కాగా, అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడైన విరాట్ కోహ్లీ.. ఆర్సీబీకి గొప్ప ఆస్తి అని ఆ ఫ్రాంచైజీ చైర్మన్ ప్రథమేశ్ మిశ్రా అన్నారు. విరాట్ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తూ అతన్ని సపోర్ట్ చేస్తున్నామని తెలిపారు. ఆర్సీబీ లీడర్షిప్ గ్రూప్కు విరాట్ వెలకట్టలేని సేవలందించాడని పేర్కొన్నారు.
ఆర్సీబీ కెప్టెన్సీ పై కోహ్లీ సంచలన ప్రకటన
- ఆట
- September 20, 2021
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- KKR vs PBKS: ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతం.. 262 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన పంజాబ్
- మీ ఫోన్ను ఎవరైనా ఉపయోగిస్తున్నట్లు అనిపించిందా..? ఈ కోడ్ డయల్ చేసి హిస్టరీ తెలుసుకోండి
- అబిడ్స్లో రూ.49 లక్షల విలువైన నోట్లకట్టలు సీజ్
- న్యూయార్క్ ఆకాశంలో ఓ వింత వస్తువు..ఏలియన్స్ వెహికలేనా?
- కాళేశ్వరం, మిషన్ భగీరథలో కేసీఆర్ లక్ష కోట్లు దోచుకుండు : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- KKR vs PBKS: 22 ఫోర్లు, 17 సిక్సులు.. పంజాబ్ బౌలర్లను చితక్కొట్టిన కోల్కతా
- స్టాక్ మార్కెట్లో మోసపోతే .. డబ్బును రికవరీ చేసి ఇచ్చిన్రు
- Whirlpool lay offs: వర్ల్పూల్ నుంచి వెయ్యి మంది ఉద్యోగులు ఔట్..
- Nelson Dilip Kumar: మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా..జైలర్ డైరెక్టర్ డ్రీం ప్రాజెక్ట్ ఇదే!
- దేశంలోనే అతిపెద్ద సైబర్ క్రైం : రూ.25 కోట్లు పోగొట్టుకున్న మాజీ డైరెక్టర్
Most Read News
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- అలర్ట్ : ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ ఆంక్షలు..
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు
- విమానంలో డీజీపీకి అసౌకర్యం