
బెంగళూరు: ఆసియా కప్ ముంగిట ఇండియా క్రికెటర్లు బెంగళూరు ఎన్సీఏలో చెమటలు చిందిస్తున్నారు. మెగా టోర్నీ కోసం బీసీసీఐ ఆరు రోజుల ఫిట్నెస్ క్యాంప్ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో గురువారం పలువురు క్రికెటర్లు ఫిట్నెస్ డ్రిల్స్తో పాటు యో–యో టెస్టులో పాల్గొన్నారు. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అందరికంటే ఎక్కువగా 17.2 స్కోరు సాధించాడు. ఈ టెస్టులో బీసీసీఐ 16.5 స్కోరును ప్రామాణికంగా పెట్టింది. కోహ్లీతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ, వన్డే వైస్ కెప్టెన్ పాండ్యా కూడా టెస్టును విజయవంతంగా పూర్తి చేసినట్టు తెలుస్తోంది.