ఈ ఓటమి సిగ్గుచేటు.. రస్సెల్, కార్తీక్ పై వీరూ ఫైర్

ఈ ఓటమి సిగ్గుచేటు.. రస్సెల్, కార్తీక్ పై వీరూ ఫైర్

చెన్నై: ముంబై ఇండియన్స్ తో మంగళవారం జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ఓటమి పాలైంది. ఆండ్రీ రస్సెల్, దినేశ్ కార్తీక్ లాంటి కీలక బ్యాట్స్ మెన్ ఘోరంగా ఫెయిల్ అయ్యారు. దీంతో సులువుగా గెలవాల్సిన మ్యాచ్ లో 10 రన్స్ తేడాతో కేకేఆర్ పరాజయం పాలైంది. ఈ జట్టు బ్యాటర్ల తీరుపై టీమ్ ఇండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అసంతృప్తిని వ్యక్తం చేశాడు. 

'తొలి మ్యాచ్ లో గెలుపు తర్వాత ఇయాన్ మోర్గాన్ అన్న మాటలు నాకు గుర్తున్నాయి. తమ టీమ్ బ్యాట్స్ మెన్ సానుకూల ధోరణితో బ్యాటింగ్ కు దిగుతారని మోర్గాన్ చెప్పాడు. కానీ ముంబైతో మ్యాచ్ లో రస్సెల్, దినేశ్ కార్తీక్ బ్యాటింగ్ లో అది కనిపించలేదు. వాళ్లు బ్యాటింగ్ చేస్తుంటే కేకేఆర్ గెలిచేలా కనిపించింది. కార్తీక్ చివరిదాకా ఉన్నా టీమ్ ఓటమి చెందింది. 27 బంతుల్లో 30 పరుగులు చేయలేకపోయారు. ఇది సిగ్గుచేటు' అని సెహ్వాగ్ కామెంట్ చేశాడు.