ఢిల్లీ ఎగ్జిబిషన్‌‌లో విశాక ప్రొడక్ట్స్..వరల్డ్ వైడ్‌‌గా తొలిసారి ఆటమ్ రూఫ్ల పరిచయం

ఢిల్లీ ఎగ్జిబిషన్‌‌లో విశాక ప్రొడక్ట్స్..వరల్డ్ వైడ్‌‌గా తొలిసారి ఆటమ్ రూఫ్ల పరిచయం

 

  • గో గ్రీన్ నినాదంతో ప్రొడక్ట్‌‌లు తయారు చేస్తున్న కంపెనీ
  • సొసైటీకి మేలు చేసే ప్రొడక్ట్స్‌‌ను ప్రమోట్ చేస్తున్నందుకు గర్వంగా ఉందన్న కంపెనీ వైస్ ప్రెసిడెంట్ 

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌‌లో జరుగుతున్న ‘ఏసీఈ టెక్’ ఎగ్జిబిషన్ షోలో విశాక ప్రొడక్ట్స్‌‌ను ప్రదర్శనకు పెట్టారు. ఈ నెల 14 నుంచి 17 వ‌‌ర‌‌కు నాలుగు రోజుల పాటు జరుగుతున్న ఈ ఎగ్జిబిష‌‌న్‌‌లో ఆర్కిటెక్చర్, కన్‌‌స్ట్రక్టింగ్, ఇంజినీరింగ్ రంగంలోని వివిధ కంపెనీల‌‌ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా బిల్డింగ్ మెటీరియ‌‌ల్స్, సోలార్ ప‌‌వ‌‌ర్, స‌‌స్టెనబిలిటీ ప్రొడక్ట్స్‌‌పై ప్రత్యేకంగా స్టాల్స్‌‌ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా విశాక.. వీ నెక్ట్, ఆట‌‌మ్ రూఫ్, ఆట‌‌మ్ లైఫ్ ప్రొడక్ట్స్‌‌ను ప్రదర్శనకు పెట్టింది. ఇందులో భాగంగా గో- గ్రీన్ నినాదంతో త‌‌యారవుతున్న కంపెనీ ప్రొడక్ట్స్ ప్రపంచానికి ప‌‌రిచ‌‌యం చేస్తోంది. ఈ ఎగ్జిబిషన్‌‌లో విశాక కంపెనీ త‌‌ర‌‌ఫున స‌‌స్టెనబిలిటీ ప్రొడక్ట్స్‌‌ను ప్రమోట్ చేస్తున్నట్లు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సుజిల్ తెలిపారు. 

ప్రపంచంలోనే తొలిసారి ఆట‌‌మ్ రూప్ అనే ‘ఫైబర్ సిమెంట్ బోర్డు’ను కొత్తగా లాంచ్ చేసినట్లు వివరించారు. ఇప్పటి వ‌‌ర‌‌కు ఇలాంటి ప్రొడక్ట్‌‌ ఎక్కడా లేదని, ప్రకృతికి ఏ మాత్రం నష్టం జరగకుండా వీటిని రూపొందించినట్లు చెప్పారు. ఫైబ‌‌ర్ సిమెంట్ బోర్డు అనేది ఆల్ ఓల్డ్ ట్రెడిషినల్ మెటీరియ‌‌ల్స్‌‌ను ఇది రీప్లేస్ చేస్తోందని వివరించారు. ఇప్పటికే దేశంలోని ఇత‌‌ర సీటిల్లో జ‌‌రిగిన ఎగ్జిబిష‌‌న్స్‌‌లో విశాక త‌‌న సామ‌‌ర్థ్యాన్ని నిరూపించుకుందని పేర్కొన్నారు. ఇప్పుడు దేశ రాజ‌‌ధాని ఢిల్లీలో జ‌‌రిగే ఎగ్జిబిష‌‌న్‌‌లో పాల్గొన‌‌డం గ‌‌ర్వంగా ఉందన్నారు. ఈ ఎగ్జిబిష‌‌న్‌‌లో విశాక ప్రొడక్ట్స్‌‌కు మంచి స్పంద‌‌న ఉంటుందని తాము భావిస్తున్నామని తెలిపారు. విశాక టీం త‌‌ర‌‌ఫున బిజినెస్ హెడ్ సునీల్, జీఎం ముఖేశ్ ఓద్యా, క్రియేటివ్ డైరెక్టర్‌‌‌‌ సిద్ధేశ్వర్ మ‌‌నోజ్ పాల్గొన్నారు.