పాయల్ రాజ్పుత్ లీడ్ రోల్లో అజయ్ భూపతి తెరకెక్కించిన చిత్రం ‘మంగళవారం’. స్వాతి రెడ్డి గునుపాటి, ఎం. సురేష్ వర్మ నిర్మించారు. మంగళవారం ఈ మూవీ సక్సెస్మీట్ను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన విశ్వక్ సేన్ మాట్లాడుతూ ‘చిన్న పాయింట్ తీసుకుని రెండున్నర గంటలు నిజాయితీగా చెప్పే దర్శకుడు అజయ్ భూపతి.
ఆయన డైరెక్షన్కు నేను పెద్ద ఫ్యాన్. త్వరలో తనతో సినిమా చేస్తా. అలాగే పాయల్ బాగా నటించారు’ అని చెప్పాడు. పాయల్ రాజ్పుత్, ప్రియదర్శి, తరుణ్ భాస్కర్, అజయ్ ఘోష్, సిరాశ్రీ, నిర్మాత సురేష్ వర్మ, బీవిఎస్ రవి తదితరులు పాల్గొన్నారు.