
స్టేషన్ఘన్పూర్, వెలుగు: తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిని విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘాల జేఏసీ కన్వీనర్అనంతోజు బ్రహ్మచారి, జనగామ వాసి అయిన జేఏసీ కోకన్వీనర్దిగోజు నరసింహచారి ఆధ్వర్యంలో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించినందుకు సీఎం, టీపీసీసీ చీఫ్మహేశ్కుమార్గౌడ్ ను కలిసి సన్మానించి, ధన్యవాదాలు తెలిపారు.
అనంతరం పలు సమస్యలపై సీఎంకు వినతి పత్రం అందజేసినట్లు నరసింహచారి తెలిపారు. సీఎం సానుకూలంగా స్పందించారని చెప్పారు. బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్చారి, అఖిల భారత విశ్వకర్మ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు కౌలె జగన్నాథం, నాయకులు పాల్గొన్నారు