మెహిదీపట్నం, వెలుగు: ప్రతి ఒక్కరు ఏదో ఓ క్రీడలో పాల్గొంటే ఉల్లాసంగా ఉంటారని మాజీ ఎంపీ, బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ వివేక్ వెంకటస్వామి అన్నారు. బుధవారం గచ్చిబౌలి బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ కంట్రీ క్లబ్లో నిర్వహించిన గోల్ఫ్ క్రీడలు టీ9, ఆర్ టోర్నమెంట్ను ‘ఆటమ్’ బైక్ సంస్థ స్పాన్సర్ చేసింది. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. క్రీడల వల్ల శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటంతో పాటు చాలా ఉల్లాసంగా ఉంటారన్నారు. చాలా మంది గోల్ఫ్ను విజయవంతం చేశారని గుర్తు చేశారు. ఇక ఆటమ్ బైక్ల్లో కొత్తగా 60 కిలోమీటర్ల స్పీడ్తో ఎలక్ట్రిక్ బైక్ను త్వరలో విడుదల చేస్తున్నట్లు చెప్పారు. 25 కిలోమీటర్ల బైక్ ధర చాలా తక్కువగా ఉందన్నారు. మెయింటెనెన్స్ చార్జెస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయన్నారు. కేవలం నాలుగు గంటల్లోనే మొత్తం బ్యాటరీ (100 కిలోమీటర్లు)ని చార్జ్ చేయొచ్చన్నారు. సేఫ్టీ, క్వాలిటీ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వివేక్, ఆయన సతీమణి సరోజా వివేక్, కుమారుడు వంశీ కృష్ణ పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం
వేసవి అయిపోతుంది..ఇంకెప్పుడు బాగుచేస్తరు?
పెట్టుబడుల వరద రాబోతుందంటారు.. కానీ