ఇసుక దందాపై బాల్క సుమన్ వేల కోట్లు దోచుకున్నారు : వివేక్

ఇసుక దందాపై బాల్క సుమన్ వేల కోట్లు దోచుకున్నారు : వివేక్

తెలంగాణలో అధికారంలోకి కాంగ్రెస్ వస్తే పేదల రాజ్యం వస్తుందన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి జీ. వివేక్ వెంకటస్వామి. బాల్క సుమన్ ఇసుక దందా మీద వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ అహంకారం దించాల్సిన టైం వచ్చిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.500కే గ్యాస్ సిలిండర్, మహిళలందరికీ బస్సుల్లో జర్నీ ఫ్రీగా కల్పిస్తామన్నారు. చెన్నూరు నియోజకవర్గంలో మైనింగ్ ఇనిస్ట్యూట్ తీసుకొచ్చి.. ఉద్యోగాలు కల్పించే బాధ్యత తనదే అన్నారు.

చెన్నూరుకు బాల్క సుమన్ చేసేందేమీ లేదన్నారు. సింగరేణి సంస్థను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. సింగరేణి డబ్బులను కేసీఆర్ కుటుంబం వారి నియోజకవర్గాలకు తీసుకెళ్తోందన్నారు. కాళేశ్వరం పేరుతో లక్షకోట్లు మింగారని ఆరోపించారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో పంటలు మునిగిపోయాయని చెప్పారు. మూడేండ్లకే కాళేశ్వరం కుంగిపోయిందన్నారు. జైపవర్ ప్లాంట్ తీసుకొచ్చాక స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదన్నారు. బాల్క సుమన్ ఫోన్ చేసిన వాళ్లకే ఉద్యోగాలు ఇస్తున్నారని చెప్పారు.