వివేక్ వెంకటస్వామి సేవలు గుర్తించి కేబినెట్ లో స్థానం .. మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం

వివేక్ వెంకటస్వామి సేవలు గుర్తించి కేబినెట్ లో స్థానం .. మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం

జైపూర్(భీమారం), వెలుగు: కాంగ్రెస్ అధిష్టానం వివేక్ వెంకటస్వామి సేవలను గుర్తించి కేబినెట్ లో స్థానం కల్పించిందని.. కార్మిక, మైనింగ్, శిక్షణ శాఖల మంత్రిగా నియమించిందని భీమారం మండల కాంగ్రెస్ నాయకులు కొక్కుల నరేశ్, సుధాకర్, బానోత్ విజయ్ అన్నారు. 

వివేక్ వెంకటస్వామికి కేబినెట్ లో స్థానం కల్పించడంపై హర్షం వ్యక్తం చేస్తూ అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్​తెలంగాణ ఇంచార్జి మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్య క్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఫొటోలకు మండల కేంద్రంలో క్షీరాభిషేకం చేశారు. నాయకులు తోట శ్రీరాములు, వేల్పుల శ్రీనివాస్, సూరం శ్యాంసుందర్, కోట రమేశ్, రమాదేవి, సుమలత తదితరులు పాల్గొన్నారు.