సింగరేణి కార్మిక కుటుంబాలకు న్యాయం చేయండి

సింగరేణి కార్మిక కుటుంబాలకు న్యాయం చేయండి

న్యూఢిల్లీ, వెలుగు: సింగరేణిలో కారుణ్య నియామకాలు జరిగేలా చూడాలని, కార్మికులకు న్యాయం చేయాలని కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేందర్​ యాదవ్​ను బీజేపీ కోర్​ కమిటీ మెంబర్​ వివేక్​ వెంకటస్వామి కోరారు. ఈ విషయంపై గురువారం ఢిల్లీలోని శ్రమశక్తి భవన్​లో కేంద్ర మంత్రిని కలిసి అన్ని వివరాలతో రిప్రజెంటేషన్​ ఇచ్చారు. 800 మందిని  కారుణ్య నియమకాల కింద తీసుకుంటామని సింగరేణి యాజమాన్యం గతంలో హామీ ఇచ్చి అమలు చేయలేదని కేంద్ర మంత్రికి చెప్పారు. మెడికల్​ బోర్డు ఎగ్జామినేషన్​ అయ్యాక కూడా వాళ్లను ఉద్యోగాల్లోకి తీసుకోలేదన్నారు. నష్టపోయిన బాధిత కార్మికులతో చీఫ్​ లేబర్​ కమిషనర్ ఆధ్వర్యంలో​మీటింగ్​ ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని కోరారు. తన విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని వివేక్​ వెంకటస్వామి చెప్పారు.