సమస్యలు తెలుసుకుంటూ.. వేడుకల్లో పాల్గొంటూ ...

సమస్యలు తెలుసుకుంటూ.. వేడుకల్లో పాల్గొంటూ ...

కోల్​బెల్ట్/చెన్నూరు/జైపూర్, వెలుగు: చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ ​వివేక్ ​వెంకటస్వామి, పెద్దపల్లి కాంగ్రెస్​ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ శుక్రవారం చెన్నూరు నియోజకవర్గంలోని పట్టణాలు, గ్రామాల్లో విస్తృత పర్యటన చేశారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారానికి హామీ ఇస్తూ భరోసా కల్పించారు. మరోవైపు పలు వివాహ, ఇతర ఫంక్షన్లకు హాజరయ్యారు. పలు బాధిత కుటుంబాలను పరామర్శించి అండగా ఉంటామన్నారు. మందమర్రి మార్కెట్​లోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ​బి-1 క్వార్టర్​ను కాంగ్రెస్ ​లీడర్లతో కలిసి ఎమ్మెల్యే వివేక్ పరిశీలించారు. 

వధువరులను ఆశీర్వదిస్తూ..

రామకృష్ణాపూర్​పట్టణం ఆర్కే1 మార్కెట్ ఏరియాలో మందమర్రి మాజీ జడ్పీటీసీ కంబగోని సుదర్శన్​ గౌడ్, పుష్పలత దంపతులు కుమారుడు సునీల్​ గౌడ్-–భార్గవి వివాహం రెండ్రోజుల క్రితం జరగ్గా వధూవరులను కలిసి ఆశీర్వదించారు. మంచిర్యాలలో నస్పూర్ ​మాజీ సర్పంచి రాచకొండ గోపాల్​రావు, అంజులత దంపతులు కుమారుడు సందేశ్​ తేజ-–నిహారిక జంటను, చెన్నూర్ మండలం అస్నాద్​ గ్రామంలో మాజీ సర్పంచ్ అట్టల రాజన్న, తిరుమల కుమారుడు మహేందర్-–సింధూజ వధూవరులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

మంచిర్యాల పట్టణంలో ప్రముఖ డాక్టర్ ​రమణ దంపతుల కుమారుడి వివాహంతోపాటు భీమారం మండల కేంద్రంలో అబ్బర్ల లక్ష్మి, శంకర్ దంపతుల కూతురు మల్లీశ్వరి వివాహం జరుగనుండగా వారిని కలిసి ఆశీర్వదించారు. మంచిర్యాలలో ప్రముఖ డాక్టర్ దంపతులు ​పూజరి అన్నపూర్ణ, రమణ  కూతురు అలేఖ్య–-మహంతినాథ్ ​రెడ్డి వివాహం నేపథ్యంలో ఆ కుటుంబసభ్యులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

 మందమర్రిలో మందమర్రి ప్రెస్​క్లబ్ ​అధ్యక్షుడు చందర్, వాణి దంపతుల కుమారుడి శ్రీయాన్​ రెండో బర్త్​డే వేడుకలకు, రామకృష్ణాపూర్ ​పోచమ్మ బస్తీకు చెందిన కాంగ్రెస్ ​లీడర్ ​సంగ రవి-, సాగరిక దంపతులు కుమారుడు శివప్రసాద్​బర్త్​డే వేడుకలకు ఎమ్మెల్యే వివేక్, గడ్డం వంశీకృష్ణ, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు హాజరై చిన్నారులను ఆశీర్వదించారు. 

గుడ్​ ఫ్రైడే వేడుకలకు హాజరైన వంశీకృష్ణ

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని విద్యానగర్ మన్నా చర్చ్ లో గుడ్ ఫ్రైడే వేడుకలకు పెద్దపల్లి కాంగ్రెస్​ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ హాజరయ్యారు. క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు వంశీకృష్ణను ఘనంగా సన్మానించారు. 

చెన్నూరులో ఇఫ్తార్​ విందులో..

చెన్నూరు పట్టణంలో సాయిమమతా హైస్కూల్​ గ్రౌండ్​లో శుక్రవారం రాత్రి మైనారిటీ నాయకులు ఫాయాజొద్దిన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు వివేక్​ వెంకటస్వామి, వంశీకృష్ణ హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. వారికి రంజాన్​పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్​ వైస్​ చైర్మన్​నవజోద్దిన్, మైనార్టీ లీడర్లు​తదితరులు పాల్గొన్నారు. భీమారం మండలం అంకుషాపూర్​లో సమత అగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లును ప్రారంభించారు.  

బాధిత కుటుంబాలకు పరామర్శ

మందమర్రి పట్టణంలోని అంగడి బజార్​లో ఇటీవల చనిపోయిన మర్రి కుమార్ కుటుంబాన్ని, చెన్నూరు పట్టణంలోని బజ్జూరి వాడకు చెందిన బజ్జూరి పెద్ద రాజయ్య ప్రమాదంలో మృతిచెందగా ఆయన భౌతిక కాయానికి నివాళ్లు అర్పించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. చెన్నూరులో అడ్వకేట్​ సంజీవ్​ప్రమాదశాత్తు కాలు విరిగితే ఆయనను కలిసి యోగక్షేమాలు ఆడిగి తెలుసుకున్నారు. రామకృష్ణాపూర్ పట్టణ మైనారిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లాడెన్ తల్లి అనారోగ్యం చెందిన విషయం తెలుసుకున్న వంశీకృష్ణ వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు.