ఈటల నిజంగా భూ కబ్జా చేసి ఉంటే ఇప్పటి వరకు ఆయనను జైల్లో ఎందుకు పెట్టలేదన్నారు జాతీయ కార్యవర్గ సభ్యులు వివేవ్ వెంకటస్వామి. భూ కబ్జా చేసినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని ఈటల సతీమని ఇప్పటికే సవాల్ చేసిందన్నారు. ఉద్యమకారులు తన దగ్గర ఉండటం కేసీఆర్ కు ఇష్టం లేదన్నారు. ఓడిపోయిన వాళ్ల బిడ్డకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారన్నారు. కుటుంబసభ్యులకే ఐదు పోస్టులు ఇచ్చారన్నారు.
ఉద్యమం కోసం కొట్లాడి, డబ్బులు ఖర్చు పెట్టుకున్నవాళ్లంతా రోడ్డున పడ్డారన్నారు. కేసీఆర్ ఓట్లప్పుడు మాయమాటలు చెప్పి తర్వాత మర్చిపోతాడన్నారు. ఈటల రాజేందర్ గెలిస్తే ఫించన్లు పోతాయని బెదిరిస్తున్నారని.. ఒకవేళ పింఛన్లు ఎవరికైనా ఆగితే ఈటల రాజేందర్ సొంత డబ్బు ఇస్తారన్నారు. మాట తప్పే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరేనని అన్నారు. ఆంధ్రా కాంట్రాక్టర్లకు తెలంగాణ నిధులు దోచిపెడుతున్నారన్నారు. మెగా కృష్ణారెడ్డికి కాళేశ్వరం ప్రాజెక్టును అప్పగించారని..36 వేల కోట్ల ప్రాజెక్టుకు లక్ష కోట్లు ఖర్చు చేశారన్నారు. 60 వేల కోట్లున్న అప్పును 4 లక్షల కోట్లు చేశారన్నారు. ఈటల రాజేందర్ వల్లే హుజురాబాద్ లో పనులు జరుగుతున్నాయన్నారు.