వరుస సెలవులతో టూర్లకు ఓటర్లు.. టెన్షన్‌లో ఎమ్మెల్సీ క్యాండిడేట్లు

వరుస సెలవులతో టూర్లకు ఓటర్లు.. టెన్షన్‌లో ఎమ్మెల్సీ క్యాండిడేట్లు
  • పోలింగ్‌కు ముందు వరుస సెలవులతో సొంతూళ్లకు, టూర్లకు..
  • ఓటింగ్ శాతం తగ్గే అవకాశం
  • ఎమ్మెల్సీ క్యాండిడేట్లలో టెన్షన్

హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి  గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ శాతం ఈసారి తక్కువగానే నమోదయ్యేలా ఉంది. ఈ నెల 14 న పోలింగ్ ఉండగా, దీనికి ముందు నుంచి వరుస సెలవులు ఉండడంతో చాలా మంది గ్రాడ్యుయేట్లు, ఉద్యోగులు ఇప్పటికే సొంతూళ్లకు వెళ్లిపోయారు.  గురువారం శివరాత్రి, శుక్రవారం షబ్ ఏ మెరాజ్ (ఆప్షనల్ హాలిడే), సెకండ్ శనివారం, ఆ తర్వాత సండే కావడంతో ఇలా వరుసగా లీవులు రావడంతో ఫ్యామిలీతో గడిపేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఈ ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 5,31,268 ఓటర్లు ఉండగా, వీరిలో 3,36,256 మంది పురుషులు, 1,94,944 మంది స్ర్తీలు ఉన్నారు. ఇందులో గవర్నమెంట్ ఎంప్లాయీస్, టీచర్స్ లక్షన్నర, లక్ష మంది ప్రైవేట్ ఎంప్లాయీస్, రెండు లక్షల మంది స్టూడెంట్స్ ఓట్లు ఉన్నాయి.  

అభ్యర్థులకు షాక్ ఇస్తున్న ఓటర్లు
ఎమ్మెల్సీ క్యాండిడెట్లకు  ఓటింగ్ టెన్షన్ పట్టుకుంది. ఓటర్ల వివరాలు తీసుకొని వారికి ఫోన్ చేసి ఓటు వేయమని విజ్ఞప్తి చేస్తున్నారు.  ఓటర్ల నుంచి షాకింగ్ రిప్లై వస్తోంది. ఓటు వేసేందుకు రాలేమని డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు.  సొంతూళ్లకు వెళ్లామని, ఫ్యామిలీతో టూర్ కు వెళ్లామని చెబుతున్నారు. మరికొంత మంది సిటీలో ఓట్లు నమోదు చేసుకొని ఇప్పుడు ఊళ్లకు వెళ్లిపోయారు. దీంతో ఆ ఓట్లన్నీ మాకే అని అనుకున్న నేతల్లో ఆందోళన మొదలైంది. ఎలాగైనా వచ్చి ఓటు వేసి వెళ్లాలని చాలా మంది  ఓటర్లను కోరుతున్నారు. సాధారణంగా జనరల్ ఎలక్షన్స్ లోనే  సిటీలో ఓటింగ్ శాతం 50 కి మించదు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటింగ్ పర్సంటేజీ 40 శాతం కూడా మించుతుందా అనే డౌట్ నెలకొంది.  కంటిన్యూగా హాలీడేస్ రావడంతో కాశీ కి వెళ్లేందుకు ఫ్యామిలీ ప్లాన్ చేసింది.  నేను కూడా వెళ్లాను. ఎన్నికల లోపు రాలేను అని  ప్రైవేట్ఎంప్లాయ్ సుదర్శన్ చెప్పాడు.