అయోధ్యలో పోలింగ్ షురూ

అయోధ్యలో పోలింగ్ షురూ

ఉత్తరప్రదేశ్ శాసనసభ ఐదో విడత పోలింగ్ కొననసాగుతోంది. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 12 జిల్లాల పరిధిలోని 61 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరగుతుంది. 692 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దాదాపు 2 కోట్ల 24 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సుల్తాన్ పుర్, చిత్రకూట్, ప్రతాప్ గఢ్, కౌశాంబి, ప్రయాగ్ రాజ్, బారాబంకి, బహ్రయిచ్, శ్రావస్తి, గోండా జిల్లాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటలుగా భావించే అమేథి, రాయ్ బరేలీ, అయోధ్యలో కూడా పోలింగ్ జరుగుతుంది.


ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, సితుర అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలుస్తున్నారు. ఆయనపై అప్నాదళ్ నేత పల్లవి పటేల్ పోటీ చేస్తున్నారు. రాష్ట్ర మంత్రులు సిద్ధార్థ్ నాథ్ సింగ్, నంద గోపాల్ గుప్తా, రమాపతి శాస్త్రి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత ఆరాధన మిశ్రా కూడా పోటీలో ఉన్నారు. 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో మొత్తం 7 విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మార్చి 3, 7వ తేదీల్లో 6, 7వ విడత పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.