సెక్టోరల్ అధికారులదే కీలక పాత్ర: వి.పి.గౌతమ్

సెక్టోరల్ అధికారులదే కీలక పాత్ర: వి.పి.గౌతమ్

ఖమ్మం టౌన్, వెలుగు: ఎన్నికల విధుల్లో సెక్టోరల్ అధికారుల పాత్ర చాలా కీలకమని ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ లో సెక్టార్​పోలీస్, రిటర్నింగ్, సెక్టోరల్ ఆఫీసర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెక్టోరల్ ఆఫీసర్లు ఎన్నికల ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టామని, డబ్బు, లిక్కర్, ఇతర ఓటరు ప్రభావిత వస్తువుల తరలింపును అడ్డుకోవాలన్నారు.

 డూప్లికేట్​ఓటర్ల లిస్ట్​తయారుచేసి పీఓకు ఇవ్వాలని ఆదేశించారు. వల్నరబులిటీ మ్యాపింగ్ పూర్తి చేయాలన్నారు. యువతతో బూత్ లెవల్​అవేర్ నెస్ టీమ్స్​ఏర్పాటు చేయాలని సూచించారు. సి విజిల్ యాప్ పై అవగాహన కల్పించాలన్నారు. స్వీప్ నోడల్ ఆఫీసర్​శ్రీరామ్ ఎన్నికల ప్రక్రియను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.  స్థానిక సంస్థల అడిషనల్​కలెక్టర్ బి.సత్యప్రసాద్, ఖమ్మం మున్సిపల్​కమిషనర్ ఆదర్శ్ సురభి, రిటర్నింగ్ ఆఫీసర లు తదితరులు పాల్గొన్నారు.

 అనంతరం వీవీసీ ట్రస్ట్ ద్వారా జిల్లా గవర్నమెంట్​మెడికల్​కాలేజీకి డొనేట్​చేసిన అంబులెన్స్ ను కలెక్టరేట్​ఆవరణలో కలెక్టర్ గౌతమ్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్.ఎస్.రాజేశ్వరరావుకు అప్పగించారు. ట్రస్ట్ చైర్మన్ రాజేంద్రప్రసాద్ ను కలెక్టర్ అభినందించారు. అలాగే ఎన్నికల కోడ్​ముగిసే వరకు రూ.50వేలకు మించి క్యాష్​తీసుకెళ్లొద్దని కలెక్టర్ గౌతమ్ ఓ ప్రకటనలో సూచించారు. వైద్యం, పిల్లల ఫీజులు, వ్యాపారం, పెళ్లిళ్లు ఇతర అవసరాలకు క్యాష్​క్యారీ చేస్తున్నవారు సరైన పత్రాలు చూపించాల్సి ఉంటుందన్నారు.