RCB అభిమానులకు గుడ్ న్యూస్.. కెప్టెన్గా విరాట్ కోహ్లీ

RCB అభిమానులకు గుడ్ న్యూస్.. కెప్టెన్గా విరాట్ కోహ్లీ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు గుడ్ న్యూస్. మరోసారి గ్రౌండ్ లో కింగ్ కోహ్లీని కెప్టెన్ గా చూసే అవకాశం దక్కింది. అవును.. గురువారం మొహాలి స్టేడియంలో జరిగిన పంజాబ్, బెంగళూరు మ్యాచ్ లో విరాట్ కోహ్లీ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ మ్యాచ్ లో రెగ్యులర్ కెప్టెన్ డుప్లెసిస్ గాయం కారణంగా ఫీల్డ్ కు దూరంగా ఉండనున్నాడు.

కాకపోతే డూప్లిసెస్ ఇంపాక్ట్ ప్లేయర్ బ్యాటింగ్ చేస్తాడు. దాంతో ఈ మ్యాచ్ లో కోహ్లీ్ కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు. అటు ధావన్ కూడా గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో సామ్ కర్రన్ పంజాబ్ జట్టు కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్.. బౌలింగ్ ఎంచుకుంది.