స్పెషల్ డ్రైవ్లో 654 కేసులు పరిష్కరిస్తాం : ఎంఆర్ సునీత

స్పెషల్ డ్రైవ్లో 654 కేసులు పరిష్కరిస్తాం : ఎంఆర్ సునీత

వనపర్తి, వెలుగు: మధ్యవర్తిత్వం ద్వారా కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న 654 కేసులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వనపర్తి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్​ సునీత తెలిపారు. శుక్రవారం జిల్లా కోర్టులో ‘90 రోజుల ప్రచారం, దేశం కోసం మధ్యవర్తిత్వం’ వాల్​పోస్టర్​ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ సెప్టెంబర్​ 31 వరకు 90 రోజుల పాటు స్పెషల్​ డ్రైవ్  నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

పెండింగ్  కేసులను పరిశీలించి మధ్యవర్తిత్వానికి అనుకూలంగా ఉన్న 654 కేసులను గుర్తించామని చెప్పారు. రాజీమార్గంలో కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. సీనియర్  సివిల్  జడ్జి రజిని, బార్​ అసోసియేషన్​ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కిరణ్ కుమార్, వెంకటరమణ, లాయర్లు కృష్ణయ్య, షాకీర్  హుస్సేన్, వెంకటేశ్, శోభారాణి, రాజు నాయక్, చందర్ నాయక్, రఘు, శ్రీదేవి పాల్గొన్నారు.