నల్లబెల్లి, వెలుగు : భగీరథ నీటిని ప్రతి ఇంటికి చేరే విధంగా చర్యలు తీసుకోవాలని వరంగల్ మిషన్ భగీరథ ఎస్సీఈ దేవేందర్ అధికారులను ఆదేశించారు. గురువారం నల్లబెల్లి పంచాయతీ కార్యాలయంలో భగీరథ నీటి సరఫరాపై అధికారులతో సమావేశం నిర్వహించారు.
నీటి సరఫరా మెయిన్టెన్స్రిజిస్ర్టర్లు లేకపోవడంతో అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామన్నారు. పంచాయతీ కార్యదర్శి ధర్మేందర్, అధికారులు పాల్గొన్నారు.
